గుత్తిలో ఘనంగా జనసేనపార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ లోగో ఆవిష్కరణ

గుత్తి, ఫిబ్రవరి 22, (జనస్వరం) : గుత్తి పట్టణంలోని టీ కేఫ్‌లో సామాన్యుల మధ్య జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన “ఉద్యమి” లోగోను జనసేన శ్రేణులు ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి మార్చి 10 వరకు జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు, వీరమహిళలకు అండగా నిలవడం, వారి కుటుంబాలకు భద్రత కల్పించడం, కొత్తతరం నాయకత్వాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ “ఉద్యమి” సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. సభ్యత్వం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా మాత్రమే కాకుండా నాయకత్వ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. పామిడి, గుత్తి, గుంతకల్ మండలాల జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, ఉపాధ్యక్షుడు వెంకటపతి నాయుడు, మండల నాయకులు, యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

See also  డంపింగ్ యార్డ్ ని ఎప్పుడు తరలిస్తున్నారు?