జనసేనపార్టీ PAC సభ్యులు పంతం నానాజీతో జనసైనికులు ఆత్మీయ సమావేశం

     కాకినాడ, (జనస్వరం) : జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నాయకులు జనసేనపార్టీ PAC సభ్యులు పంతం నానాజీని మర్యాదపూర్వకంగా జనసైనికులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో, శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే నానజీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల స్థాయి నుండి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసైనికులకు దిశ నిర్దేశం చేశారు. అలాగే గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానజీ, అలాగే జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, శ్రీనివాస్, సీహెచ్.అనిల్ కుమార్, రవి రాజ, టీ.ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

See also  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వల్లూరు గ్రామస్తులు ఆందోళన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి