మై ఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో 65వ రోజు ” జనం కోసమే జనసేన పాదయాత్ర “

మై ఫోర్స్ మహేష్

         మదనపల్లి ( జనస్వరం ) : జనం కోసమే జనసేన పాదయాత్ర 65వ రోజు మదనపల్లి నియోజకవర్గంలోని కొండా మరి పల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో గత 65 రోజుల నుంచి జనం కోసమే జనసేన పేరుతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి లక్ష్యంగా ఈ కార్యక్రమం గత 65 రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని కాశిరావుపేట దగ్గర నుంచి మదనపల్లి రూరల్ మండలం మొత్తం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలోని సమస్యలు వెలిగితే సమస్యలపై పోరాడి ప్రజల తరఫున పోరాటమే లక్ష్యంగా తలపెట్టినటువంటి ఈ పాదయాత్ర ఈరోజుతో 65 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండా మరిపల్లిలో ప్రజల ఆదరాభిమానాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సల్మాన్ చంటి, సునీత, షబ్బీర్, పవన్, దామోదర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

See also  పాము కాటుకు గురైన బాధితుడికి జనసైనికుల ఆర్థిక సహాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి