జనసేనపార్టీ క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ అందించించిన జనసేన నాయకులు

జనసేనపార్టీ

           అమలాపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు అందజేసే ప్రమాద బీమా పథకంలో భాగంగా అమలాపురానికి చెందిన తోట కిరణ్ అనే జనసైనికుడు ప్రమాదానికి గురైనారు. చికిత్స చేయించుకున్న సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన 28 వేల రూపాయలు చెక్కును నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలకు ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు భరోసాగా అండగా ఉండే కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ ప్రమాద భీమా పథకంఅని అన్నారు.  ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు పట్ల కార్యకర్తల పట్ల ప్రేమతో వారి కుటుంబాలకు భరోసాగా ఏర్పాటు చేసిన పథకం. అందులో భాగంగానే ఈరోజు తోట కిరణ్ కుటుంబానికి 28 వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, జనసేన పార్టీ నాయకులు ఆకుల బుజ్జి, సుధా చిన్నా, కుంపట్ల వెంకట రమేష్, తూము రమేష్, సత్తి శ్రీనివాస్, వలవల చిన్న, పొనకల ప్రకాష్, నూకల వెంకటరమణ  తదితరులు పాల్గొన్నారు.

See also  దెందులూరు నియోజకవర్గంలో కొఠారు ఆదిశేషు నేతృత్వంలో జనసేనలో చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి