
ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అనంత సాగరం మండలం సోమశిల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పరామర్శించారు. ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి సాయం చేస్తాం అని, పేదలకి ఎపుడు మా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రవి ఉదయగిరి మాట్లాడుతూ నష్టపోయిన కౌలు రైతులకు పవన్ కల్యాణ్ లక్ష రూపాయలు 3000 మంది రైతులకి ఇస్తున్నారు అని ఇటువంటి నాయకుడుని ప్రజలు ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేణు గుడిపాటి, మండల కార్యనిర్వాహక కార్యదర్శి సత్యాల తిరిపాలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనిల్ రాయల్, నియోజకవర్గ నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.









