
ఏలూరు ( జనస్వరం ) : భారతదేశ వ్యాప్తంగా హిందుస్తాన్ టైంస్ మరియు ఇతర మీడియా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 2023 సంవత్సరానికిగానూ దేశంలో 100 మంది భవిష్యత్ నాయకులు జాబితాలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ చోటు సంపాదించుకున్నారు. ఈ గుర్తింపు ఆయనలోని నాయకత్వ లక్షణాలకు, సమాజంలోని యువతను చైతన్య పరుస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నందుకు గానూ వరించిందని జ్యూరీ తెలిపింది. గతంలో సాయి శరత్ కు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నుండి ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ లో గౌరవ డాక్టరేట్ వచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా జనసేన పార్టీలోని అలాగే ఏలూరు నగరం, దెందులూరు నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు సాయి శరత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు .








