జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

  జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు ఉన్నటువంటి గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం పెనుగంచిప్రోలు లోని కెవిఆర్ గార్డెన్స్ లో జనసేన నియోజవర్గ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిస మురళి కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడు తునికిపాటి శివ, జగ్గయ్యపేట మండల అధ్యక్షుడు తులసి బ్రహ్మం వత్సవాయి మండల అధ్యక్షుడు రేగళ్ల వెంకటరామయ్య, మాట్లాడుతూ జగ్గయ్యపేటలో అసలైన రాజకీయం ఇప్పుడు మొదలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన వెదుల్లవలస గ్రామస్తులు