దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు అన్ని శాఖలు ఏర్పాటు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దివ్యాంగులు అంటే ఇంత చిన్న చూపా? లేక అంటరానితనం అని ప్రశ్నించారు. వెంటనే దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 14న బాపట్ల మున్సిపల్ ఆఫీస్ లో కొంతమంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసి నియోజకవర్గంలో ఉన్న ఇంకా కొంతమంది దివ్యాంగులకు ఎంత వరకు ఉపకరణాలు పంపిణీ చేయలేదు. వెంటనే దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ చేయాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి  జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

See also  సర్వమత ప్రార్థనలు నిర్వహించిన విజయనగరం జిల్లా చిరంజీవి యువత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి