జనసేనాని స్ఫూర్తితో విశాఖలో దివ్యాంగులకు 4 వీల్ చైర్స్ అందించిన జనసైనికుడు నీలం రాజు

జనసేనాని స్ఫూర్తితో విశాఖలో దివ్యాంగులకు 4 వీల్ చైర్స్ అందించిన జనసైనికుడు నీలం రాజు
           జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అనగారిన వర్గాలైన దివ్యాంగులకు 4 వీల్ ను జనసైనికుడు నీలం రాజు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ గారు హాజరయ్యారు. వైజాగ్ కొబ్బరి తోట పలు ప్రాంతంలో జనసేవా కార్యక్రమాలు చేసిన రాజు వారి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసిన తమ్మిరెడ్డి శివశంకరరావు గారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎక్కడ ఏం కష్టం వచ్చినా జనసైనికులు అండగా ఉంటున్నారని, మనం  కళ్ళారా చూస్తున్నామని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో జనసేవ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారని, అలాగే దాదాపుగా 750+ ఆక్సిజన్ సిలెండర్లను అందించి ప్రజల మన్నలను పొందారన్నారు. నీలం రాజు మాట్లాడుతూ జనసేనాని స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని, విజయదశమి రోజున దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించి వారికి ఆనందాన్ని పంచడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొడ్డేపల్లి రఘు వన్నెంరెడ్డి, సతీష్ కుమార్, పి శివప్రసాద్, గోపికృష్ణ(GK), నరేష్, వీరు, లుక్స్ గణేష్ మరియు బిజెపి నాయకులు మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 
See also  చంద్రబాబు అక్రమ అరెస్ట్ జగన్ శాడిజానికి నిదర్శనం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి