గంగరాయివలస గ్రామ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్థూపం ఆవిష్కరణ

    కురుపాం, (జనస్వరం) :  కురుపాం నియోజకవర్గం, గంగరాయివలస గ్రామ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్థూపాన్ని జనసేనపార్టీ  రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గ్రామ ప్రజలందరినీ కలసి ఈసారి కుటుంబ సమేతంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, మన పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం కొన్ని కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ అధ్వర్యంలో "మకర జ్యోతి"