
తిరువూరు నియోజకవర్గంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన మెగా అభిమానులు, జనసైనికులు
తిరువూరు నియోజకవర్గం, చీమలపాడు మండలం చిరంజీవి యువత, జనసైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి గారి 65వ జన్మదిన రోజు సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో విస్తృతంగా సేవ మరియు సహాయక కార్యక్రమాలు చేయడం జరుగింది. అందులో భాగంగా ఈ రోజు గారి జన్మదిన వజ్రోత్సవాలలో భాగంగా తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండలంలోని చీమలుపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కల నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిష్ణ జిల్లా (పశ్చిమ) చిరంజీవి యువత ఉపాధ్యక్షులు – శ్రీ పగడాల లక్ష్మణరావు గారు, అధికార ప్రతినిధి శ్రీ మనుబోలు శ్రీనివాసరావు గారు, తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ చింతలపాట్టి వెంకట క్రిష్ణ గారు, తిరువూరు నియోజకవర్గ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీ మేకల రామారావు (జాన్) గారు, ఏ. కొండూరు మండల చిరంజీవి యువత ఉపాధ్యక్షులు శ్రీ లకావాతు విజయ్ గారు, గంపలగూడెం జనసేన పార్టీ యూత్ నాయకులు శ్రీ చింతలపాట్టి మాధవ్ గారు, ఏ. కొండూరు మండలం రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీ ములగపాటి రాజేష్ గారు మరియు మేకల తరుణ్, గంపలగూడెం మండలం చిరంజీవి యువత శరత్ఉట్టికొండ క్రిష్ణ గారు, అశోక్, సురేంద్ర, వర్దన్, వంశీ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.









