ఆత్మకూరు ప్రధాన సమస్యలను పట్టించుకోండి : గునుకుల కిషోర్

ఆత్మకూరు ప్రధాన సమస్యలను పట్టించుకోండి : గునుకుల కిషోర్

                  ఆత్మకూరు నియోజకవర్గంలో సమస్యలు మెండుగా ఉన్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోక ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గాన్ని సమస్యలను పరిష్కరించి ఆర్థికంగా అభివృద్ధి పరచాలని సెప్టెంబర్2 జనసేనాని జన్మదినం రోజు నుండి రైజ్ యువర్ వాయిస్ అనే నినాదంతో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పాద నడకన వచ్చిన నళిశెట్టిశ్రీధర్ గారిని, జనసేన పార్టీ జిల్లా చెన్నారెడ్డిమనుక్రాంత్ గారి తరపున వారిని ఆహ్వానించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు గునుకుల కిషోర్ గారు. 

                 ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం ప్రదాన సమస్యలైన, ఆత్మకూరు ప్రత్యేక జిల్లా సాధన, సోమశిల జలాశయం నిఖర జిలాలలో ఆత్మకూరు నియోజకవర్గానికి సరైన హక్కులు, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం సత్వర పూర్తికి నిధుల మంజూరు, నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గం భూసేకరణ మరియు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, తన వంతు నిధులు మంజూరు, సంగం బ్యారేజీ బ్యాక్ వాటర్ నుండి సంగం, ఏ. ఎస్. పేట,చేజర్ల మండలాలకు సాగునీటి సదుపాయం, చుక్కల భూముల సమస్యకు సుమోటోగా పరిష్కారం, పారిశ్రామికంగా నిర్లక్ష్యానికి గురైన ఆత్మకూరులో పరిశ్రమల ఏర్పాటు తద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన మొదలగు సమస్యల సాధన కొరకు,ఆత్మకూరు నుండి నెల్లూరు వరకు పాదయాత్ర జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3రోజుల పాటు నిర్వహించి ఈ రోజు నెల్లూరు చేరుకొని జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సహృదయంతో స్పందించిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.ఈ కార్యక్రమంలో మూడు రోజులపాటు నాతో పాదయాత్రలో పాల్గొన్న ప్రతి జన సైనికుడికి పాదాభివందనం చేస్తున్నాను మరియు ఈ పాదయాత్రను సాదరంగా ఆహ్వానించిన నెల్లూరు జిల్లా పార్టీ నాయకులు శ్రీ గునుకుల కిషోర్ గారికి కొట్టే వెంకటేశ్వర్లు గారికి టోనీ బాబు గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

See also  కౌముది విద్యాసంస్థల అధినేత పొదిలాపు స్వామినాయుడు, పాత్రుని పాపారావు జనసేనపార్టీలోకి చేరిక