
నెల్లూరు, అక్టోబర్ 25, (జనస్వరం) : భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను సుపరిపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. శీలం, సంయమనం, దేశభక్తిని రాజకీయాల్లో ఆచరణలో చూపిన మహనీయుడిగా వాజ్పేయి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి మాలలు వేసి జనసేన నాయకులు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్ తదితర జనసైనికులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా, జాతీయ ఐక్యతే మార్గదర్శకంగా వాజ్పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భయరహితమైన నవనిర్మాణ భారత నిర్మాణానికి ఆయన ఇచ్చిన ప్రేరణ ప్రతి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆ మహనీయుడికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వాజ్పేయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీ రెడ్డి, లయన్స్ క్లబ్ యుగంధర్, సమాజసేవకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









