అటల్ వాజ్‌పేయి శత జయంతికి ఘన నివాళులు

నెల్లూరు, అక్టోబర్ 25, (జనస్వరం) : భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను సుపరిపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. శీలం, సంయమనం, దేశభక్తిని రాజకీయాల్లో ఆచరణలో చూపిన మహనీయుడిగా వాజ్‌పేయి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి మాలలు వేసి జనసేన నాయకులు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్ తదితర జనసైనికులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా, జాతీయ ఐక్యతే మార్గదర్శకంగా వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భయరహితమైన నవనిర్మాణ భారత నిర్మాణానికి ఆయన ఇచ్చిన ప్రేరణ ప్రతి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆ మహనీయుడికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీ రెడ్డి, లయన్స్ క్లబ్ యుగంధర్, సమాజసేవకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

See also  Grand Training Maha Abhiyan Held in Penugonda

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి