
వెంకటగిరి, గూడూరు రహదారి గురించి కలెక్టర్ గారికి వినతి ఇచ్చిన జనసేన నాయకులు గునుకుల కిషోర్
నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పర్యటించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్థానికులు వెంకటగిరి నుండి గూడూరు రహదారి అధ్వానంగా ఉండటం గురించి స్థానికులు వివరించగా, నెల్లూరు పార్లమెంటరీ ఇన్చార్జ్ మనుక్రాంత్ గారిని స్థానిక నాయకులతో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లవలసినదిగా తెలిపారు. ఈ రోడ్డంతా గుంతల మయం అద్వానంగా మారిందని.. రోజుకు ఐదారు యాక్సిడెంట్లు అవుతున్నాయని అని ఒక సంవత్సర కాలంగా దాదాపు 5 మంది మృత్యువాత పడ్డారని…పవన్ కళ్యాణ్ గారికి స్థానికుల తెలిపిన వైనంను మనుక్రాంత్ గారి సూచనల మేరకు జనసేన నాయకులు గునుకుల కిషోర్ మరియూ గూడూరు జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్ కలెక్టర్ గారికి పరిస్థితిని ఫోటోలతో సహా వివరించడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని వీలైనంత తొందరగా సిమెంటు రోడ్డు వేయిస్తున్నామని హామీ ఇచ్చారు ప్రతి సమస్య పై స్పందించి తగు చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ గారికి జనసేన పార్టీ తరపున అభినందనలు తెలిపారు..








