రక్తపుమడుగులో ఉన్న తల్లి బిడ్డను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

        గుడివాడ ( జనస్వరం ) :  కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బొమ్ములూరు రోడ్డలో ఒక తల్లి కాలు విరిగి తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడటంతో అటుగా వెళ్తున్న ప్రజలు మరియు వాహనదారులు ఎవరూ పట్టించుకోలేదు. ఒక మహిళ పరిస్థితిని చూసి 108 మరియు 100 కాల్ చేసిన సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో గుడివాడ పట్టణం జనసేన సైనికులుకి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకుని వెళ్లి చికిత్స చేపించి ప్రాణాలు కాపాడడం జరిగింది.  ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ రెండు గంటల నుంచి తల్లి రక్తపుమడుగులో ఉండి చిన్న బిడ్డ ఏడుస్తున్న ఎవరూ పట్టించుకోలేదని మానవత్వం మంటగలిసి పోతుందని ఒక కాకికి చిన్న ఇబ్బంది వస్తానే పది కాకులు కావు కావు అని అరుస్తూ ఉంటాయన్నారు.  మరి మనం మనుషులం అయ్యి ఉండి మానవత్వని మంట కలుపుతున్నామని దయచేసి మానవత్వాన్ని బ్రతికించండి అని మానవ సేవే మాధవ సేవ అని తెలియజేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి, పోలీస్ వారికి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, జగదీష్, మెకానిక్ మూర్తి గారు, పాల్గొన్నారు. 

See also  ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ అధ్వర్యంలో "మకర జ్యోతి"