
అనాధ శవానికి దహన క్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ జనసైనికులు మాచర్ల రామకృష్ణ
కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ఓవర్ బ్రిడ్జి దగ్గర ఒక వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ Rk గారికి తెలియజేయగా వెంటనే స్పందించిన ఆర్కే గారు.. ఆ వృద్ధుడు పేరు బుక్కురి నాగేశ్వరరావు, వయసు 63 సంవత్సరాలు మరియు చిరునామా తెల్సుకుని కుటుంబ సభ్యులకు తెలియజేసి వారితో దహన సంస్కారాలు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆర్కే మాట్లాడుతూ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవాలని ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆ భగవంతుని కోరడం జరిగింది.. అలాగే మానవత్వంతో సమాజానికి మంచి చేయాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. స్థానికులు మానవత్వంతో జనసైనికులు చేసిన పనికి అభినందిస్తున్నారు.








