
అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన గుడివాడ జనసైనికులు
పేపర్ బాయ్’గా జీవితాన్ని ప్రారంభించి, ‘మిస్సైల్ మ్యాన్’ గా ఎదిగి అందరికి ఆదర్శంగా నిలిచి, మనదేశ కీర్తిని నలుదిక్కులకు చాటిన మాజీ రాష్ట్రపతి భారత రత్న శ్రీ డా౹౹ ఏ.పీ.జే అబ్దుల్ కలాం గారి జయంతిని, పురస్కరించుకొని కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో నిరుపేద కుటుంబాలకి నిత్యవసర సరుకులు అందించిన గుడివాడ పట్టణ జనసేన నాయకులు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని అన్నారు.









