
మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి జనసేనపార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు
మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి జనసేనపార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసిన మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అధికార ప్రతినిధి అక్కల రామమోనరావు గాంధీ గారు జనసేనపార్టీ గ్రామ అధ్యక్షులుగా ధర్మారావు గారు ఎన్నిక చేశారు. కమిటీ సభ్యుల మొత్త౦ 25 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. గాంధీ గారు మాట్లాడుతూ రాష్ట్రం వైసీపీ అరాచక పాలన చూస్తుంటే ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. సుమారు 80లక్షలు కుటుంబాలు ఇసుక దొరక్క రోడ్డున పడ్డారు రాష్ట్రం లో అభివృద్ధి లేదు మాకు సంక్షేమ పథకాలు మాకు వద్దు మాకు పని చూపించండి అని ప్రజలు అడుగుతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయి ప్రజలు ఆర్ధికంగా ఇబ్బంది పడి రోడ్డు మీదకి వస్తున్నారు. రహదారులు బాగులేవు రాష్ట్రం ఎక్కడ చూసినా ప్రమాదాలు, ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి దీనికి కూడా ప్రభుత్వమే కారణం అని గాంధీ గారు ఘాటుగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో 200 మంది జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








