సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం – డాక్టర్ సింగరాజు సాయికృష్ణ ,డాక్టర్ విద్య

ఉచిత వైద్య శిబిరం విజయవంతం – డా సింగరాజు సాయికృష్ణ,డా సింగరాజు విద్య.

సత్తెనపల్లి రూరల్ ,జూలై 23( జనస్వరం )

సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సింగరాజు చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించందని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సింగరాజు సాయికృష్ణ తెలిపారు.

ఈ శిబిరంలో సాయికృష్ణ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు, నెమ్ము,దగ్గు, ఆయాసం,ఉబ్బసం వ్యాధుల పట్ల తీసుకువాల్సిన జాగ్రత్తలు హాజరైన రోగులకు అవగాహన కల్పించారు.

ఈ శిబిరంలో బీపీ,షుగర్,జ్వరాలు నెమ్ము, ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గు, థైరాయిడ్ సమస్యలు, మరియు అన్ని జనరల్ వ్యాధుల కు ఊపిరితిత్తుల వ్యాధులకు ఉచితంగా (ఈసీజీ,Random షుగర్, థైరాయిడ్ ప్రొఫైల్, Hb1Ac)పరీక్షలు చేసి సుమారు 170 మందికి వైద్య సేవలు అందజేశారు.అలాగే అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ వైద్య శిబిరంలో గ్రామపెద్దలు గద్దె అప్పారావు, లగడపాటి గజానన, జీ.రమేష్ ,జి . ఆంజనేయులు, కే. పుల్లారావు, బి. పుల్లారావు, బి. సాంబశివరావు, ఎల్. రామారావు మరియు గుడిపూడి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  విద్యార్థికి ఆర్థిక సాయమందించిన జనసేన నాయకులు