జనసైనికుల పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

         కాకినాడ ( జనస్వరం ) : కాకినాడ జిల్లా తునిలో ఉప్పరగూడెం కాలనీ వద్ద జనసేన పార్టీ  పర్యవేక్షణలో హైమా నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 52 మంది స్థానికులు వచ్చి కంటి పరీక్షలు చేసుకున్నారు. 12మందికి ఆపరేషన్ అవసరం అవుతుందని సూచించారు. మిగతా వారికి మెడిసిన్ ఇచ్చారు. పాయకరావుపేటలోని హైమ నేత్రాలయం వద్ద గురువారం నాడు ఉచితముగా ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. జనసేన ఇళ్ల నారాయణ మూర్తి అధ్యక్షతన ఉప్పలపాటి సీతారామరాజు, వెగిసెట్టి రమణ, జనసెన శివ, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్న బాబు, చొడిశెట్టి గణేష్, సూర్య భాస్కర్, వంగలపూడి నాగేంద్ర, వాసంశెట్టి అప్పారావు కర్జూరపు ఆనంద్ బాబు, లంకడ రామకృష్ణ, బావిరిసెట్టి సత్యనారాయణ, మొగ్గ తేజ, వాసంశెట్టి శివ, వాడపల్లి రాము, వెంటురి ప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  పాతకోట, రేగం రహదారులను త్వరగా నిర్మించాలి : అనంతగిరి జనసేన నాయకులు