జనసేన జెండా దిమ్మెకు శంకుస్థాపన

జనసేన

    విజయవాడ (జనస్వరం) : ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ నకరికల్లు మండలం, గుండ్లపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ జండా దిమ్మె శంకుస్థాపనకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చి గ్రామ కమిటీ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయం ఇన్చార్జి సిరిగిరి మణికంఠ, నగరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, గుండ్లపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉదారపు చినరాజు, గ్రామ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి ఏసుబాబు, గ్రామ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన్యంపులి వీరాంజనేయులు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిని శీను, రాజుపాలెం మండల వైస్ ప్రెసిడెంట్ అంచుల అనూష్, రాజుపాలెం మండల వైస్ ప్రెసిడెంట్, పసుపులేటి వెంకటస్వామి, రామాంజనేయులు, సుబ్బు, కేదరి రమేష్, సైదులు, శీను, ఆలీ, ఇనుముక్కల బాబు, జిల్లా, మండల, గ్రామ కమిటీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

See also  గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కటకం అంకారావు సామాజిక సేవకు స్పూర్తికి నిదర్శనం