రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

                   రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ మెయిన్ రోడ్డు బస్టాండ్ దగ్గర విజయదశమి సందర్భంగా అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ MP అభ్యర్థి శేఖర్ గారు, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్  పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ద్రాక్షారామ గ్రామ వాస్తవ్యులు శ్రీ కంచెర్ల వెంకటేశ్వరరావు గారి సహకారంతో ఏర్పాటు చేయడమైనది. జెండా ఆవిష్కరణ చేసి, కేకు కట్ చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 750+  ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు జనసేన రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమీటీ మెంబర్, కాకినాడ Ex మేయర్ సరోజ పొలసపల్లి గారు, ముత్యాల జయలక్ష్మి, పిల్లా రమ్య జ్యోతి, రామచంద్రపురం జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి, బుంగారాజు, శ్రీ అన్యం రాము, రామచంద్రపురం రూరల్ ZPTC అభ్యర్థి ముప్పనపల్లి గణేష్, పోలిశెట్టి శ్రీను, సంపత్, గొల్లపల్లి క్రిష్ణ, అక్కిరెడ్డిశ్రీను, అంకం శ్రీను, అనిశెట్టి బాబ్జి, ఆళ్ళ రామం, మంజేరు బాబ్జీ, కేశవ రాఘవేంద్ర రావు, కొమ్మిరెడ్డి సురేష్, ఆరంకోటి ఆనంద్,మిధిల్, సిద్ధా బత్తుల మణికంఠ, రాంబాబు నాయుడు, తోట రామకృష్ణ, నాగేశ్వర రావు, వీరు బండి, గంటా శివ, క్రిష్ణ చైతన్య గారు దేవరపల్లి చక్రధర్, ప్రసాద్ (ఊడిమూడి), జడ్డుసతీష్,కాళ్ళ ప్రసాద్, మద్దా ప్రసాద్, నానాజీ మాధవరపు, నామావిష్ణుచక్రం గారు, చోడిశెట్టి శ్రీను గారు, డేగల సతీష్, యేరుబండి నాని, నున్న విష్ణు మూర్తి, సత్తిరాజు, బాల రాజు, ఆకుల సత్తిబాబు, మరియు తదితర రామచంద్రపురం నియోజకవర్గం జనసైనికులు అందరూ పాల్గొనడం జరిగింది.

See also  అనిల్ కుమార్ యాదవ్ ముత్తుకూరు గేట్ బ్రిడ్జ్ సొంత డబ్బులతో కట్టిస్తున్నాడా? ప్రగల్భాలకు హద్దుండాలి : చెన్నారెడ్డి మనుక్రాంత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి