
కళ్యాణదుర్గం, అక్టోబర్ 05, (జనస్వరం) : కళ్యాణదుర్గం పట్టణంలో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ శుక్రవారం ఘనంగా జరిగింది. 40 ఏళ్లుగా స్వంత భవనం కోసం ఎదురుచూస్తున్న అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 2.25 కోట్ల రూపాయల వ్యయంతో భవనం నిర్మాణం చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. 60 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భవనానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, కూటమి నాయకులు, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్నిమాపక భవనం నిర్మాణం స్థానికుల 40 ఏళ్ల ఆశయమని, నూతన అగ్నిమాపక పరికరాలు కూడా విభాగానికి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. నిర్మాణ పనులను 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు పేర్కొన్నారు.








