విద్యుత్ షాక్ తో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

        టెక్కలి‌ ( జనస్వరం ) : సంతబొమ్మాలి మండలం సీతానగరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన బచ్చల రామారావు కుటుంబానికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఆముదాలవలస ఇంచార్జ్  పేడాడ రామ్మోహన్ రావు, టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్  కణితి కిరణ్ కుమార్, జనసేన నాయకులు, సీతానగరం యూత్ అసోసియేషన్స్ సమక్షంలో ఆర్థిక సహాయాన్ని 60,000 రూ. అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సహాయ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగూడు కుమారస్వామి, పేడాడ త్రివేణి రావు, బుడ్డ గవరయ్య, ఆబోతు వెంకటరమణ, గద్దయ్ భాస్కరరావు, లింగుడు భీమారావు, ఇలపండ రమేష్, కొత్తూరు హరి, ధర్మ, కిరణ్, యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగూడు గిరి వర్మ, వైస్ ప్రెసిడెంట్ వాడరేవు సింహాచలం పాల్గొన్నారు.

See also  ఎస్వీయూలో నేడే శ్రీశ్రీ కళావేదిక సాహిత్య, సాంస్కృతిక సంబరాలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి