కరప గ్రామ కమిటీ అధ్వర్యంలో జనసేన కార్యాలయం ఏర్పాటు

       కాకినాడ, (జనస్వరం) : కరప మండలం కరప గ్రామ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, టీడీపి, బీజేపీ పార్టీల నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేసిన జనసేన – టీడీపి – బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ మరియు టీడీపీ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరప గ్రామంలో పల్లపు వీధికి చెందిన శ్రీపాదం గంగయ్య, చిన్నారి శ్రీను, గండి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో 30 మంది పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన టిడిపి బిజెపిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ  వారికి కండువాలు వేసి సాధారంగా జనసేన పార్టీలోకి స్వాగతం పలికారు.

See also  పోలవరం బుడమేరు ముంపుకు గురయ్యే ప్రాంతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులకు ఇళ్ళు