ఉరవకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరం’ ఏర్పాటు

       ఉరవకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారం డొక్కా సీతమ్మ (ఉచిత భోజన) శిబిరంను ఉరవకొండ పట్టణం స్థానిక మార్కెట్ యార్డ్ నందు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఉరవకొండ మండల కార్యదర్శి విశ్వనాధ్ ఆధ్వర్యంలో శిబిరంను ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సోమవారం ‘డొక్కా సీతమ్మ శిబిరం’ (ఉచిత భోజనం) నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, మల్లేష్ గౌడ్, తిలక్,(మాల)సోము, నీలకంఠ, విజయ్, హరి, జొల్లమణికంఠ, రంగా, మోపిడి హరి(శ్రీజ పాలు), సురిష్, మణి కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికులకు, నాయకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

See also  జనసేవ సమాజసేవలో మెగా ఫ్యాన్స్ తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి