
సమిష్టి కృషితో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి- డాక్టర్ అనితా రెడ్డి
హన్మకొండ ,జూన్ 28 (జనస్వరం)
బాలసముద్రం లోని వడ్డెర బస్తి పోలియో సెంటర్స్ లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ నిండు ప్రాణానికి రెండు చుక్కలు’ ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జననం నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపు నిచ్చారు. నిండు ప్రాణానికి రెండు చుక్కలు” అనే నినాదంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పోలియో నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమిష్టి కృషితో ప్రజలందరూ విజయ వంతం చేయాలని,
సమీప పోలియో కేంద్రానికి తమ చిన్నారులను తీసుకువచ్చి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డాక్టర్ అనితా రెడ్డి కోరారు.








