
రైతుల త్యాగాన్ని వృధా కానివ్వం : గుంటూరు జనసైనికులు
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తమ భవిష్యత్తుని పట్టించుకోకుండా తమ వ్యవసాయ భూముల్ని ఇచ్చిన రైతులకు భవిష్యత్తు లేకు౦డా చేస్తుంటే జనసేన చూస్తూ ఊరుకోదు అని గుంటూరు జనసైనికులు హెచ్చరించారు. సంవత్సర కాలంగా శాంతియుత ప్రజాఉద్యమం చేస్తున్న రైతులకు అండగా రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. ఈ సందర్భ౦గా మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చి … ఈ రాష్ట్రాన్ని కాపాడమంటూ శ్రీనివాసరావుతోట లోని స్వతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు విగ్రహానికి జనసేన శ్రేణులు గురువారం వినతిపత్రం అందచేశారు. జనసైనికులు మాట్లాడుతూ నాడు అసెంబ్లీలో జగన్ గారు అమరావతి రాజధానిగా అంగీకరింపజేసి, 33 వేల ఎకరాలు అవసరమని అంగీకరించారు. ఈరోజున అధికారం చేపట్టిన తరువాత ఒక నియంతలా వ్యవరిస్తూ ఆ రోజు అంగీకరించిన నిర్ణయాన్ని ఈ రోజు మార్చడం తమ పతనానికి దారి తీస్తుందని అన్నారు. ఈ కార్యకరమంలో బండారు రవీంద్ర కుమార్, ఆళ్ళ హరి, కాశీ విశ్వనాధ్, ప్రసాద్, అన్వేష్ మాదాసు తదితర జనసైనికులు పాల్గొన్నారు.








