
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీలో నివాసముండే జనసేన పార్టీ క్రియాశీలక మహిళా సభ్యురాలు దేవరకొండ నారాయణమ్మ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి ఆధ్వర్యంలో డ్యూటీ డాక్టర్ను కలిసి రోడ్డు ప్రమాదం జరిగిన వివరాలు తెలుసుకొని జనసేన పార్టీ మీకు అండదండగా ఉంటుందని భరోసా కల్పించి, జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ మీకు ఏం అవసరం వచ్చిన ఎల్లవేళలా అందుబాటులో ఉండి, అన్ని విధాలుగా అండదండలు అందిస్తానని తెలియజేసి, పరామర్శించి భరోసా కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయపడిన దేవరకొండ నారాయణమ్మకి తగిన జాగ్రత్తలతో మోకాలు సర్జరీ చేయాలని సర్జరీకి అటెండ్ అయ్యే డాక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, అవుకు విజయ్, నగర ఉపాధ్యక్షులు గ్రందే దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు రోళ్ల భాస్కర్, కమతం వెంకట నారాయణ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళ కాశెట్టి సావిత్రి, జనసేన నాయకులు తోట ప్రకాష్, M.V శ్రీనివాసులు, మోపూరి కృష్ణ, పాలగిరి చరణ్ తేజ్, దండు హరీష్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.









