శ్రీ ఆంజనేయ బృందావన్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

      విజయవాడ, (జనస్వరం) : శ్రీ ఆంజనేయ బృందావన్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, విల్లా.వీర్రాజు ఆధ్వర్యంలో కోతి బొమ్మ సెంటర్‌ వద్ద హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని 200 మందికి చీరల పంపిణీ 1000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ప్రముఖ న్యాయవాది పిల్ల. శ్రీనివాస రావు ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, టీడీపీ నాయకులు కొప్పుల.గంగా, జనసేన పార్టీ నాయకులు రెడ్డిపల్లి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వీర్రాజు మిరప బృందం ఆధ్వర్యంలో అన్ని దైవ కార్యక్రమాలను స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఎంతో భక్తిశ్రద్ధలతో అందరికీ ఆదర్శంగా చేస్తున్నారని వీరికి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మహేష్‌ తెలియజేశారు.

See also  అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు గెడ్డం బుజ్జి