
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ధర్మశాల టీం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ
జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే విధానంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ధర్మశాల టీం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మట్టి వినాయక ప్రతిమలు పంచిన జనసేన నాయకులు వినాయక చవితి సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి అని కరోనా మహమ్మారి నుండి అతి తొందరగా ప్రపంచాన్ని గణ నాధుడు గట్టెకించాలని కోరుతూ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను జనసేన నాయకులు పంచిపెట్టారు. కరోనా కారణంగా జనాలు గుంపుగా ఉంటే ప్రమాదం అని, ప్రభుత్వం వినాయక మండపాలకు పర్మిషన్ ఇవ్వకుండా, వేలమంది జనాలు ఉండే మద్యం షాపులకి పర్మిషన్ ఇవ్వడం దారుణం అని అన్నారు. అలాగే వినాయక విగ్రహాల ఎత్తుపై ప్రభుత్వం ఒక నెల ముందుగా ఇటు భక్తులకు అటు విగ్రహాలు తయారు చేసే వారికి తెలియచేసి ఉంటే బాగుండు అని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇళ్ళకే పరిమితమై కేవలం మట్టి వినాయకుడి విగ్రహానికి మాత్రమే పూజలు చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రాధ కృష్ణ, సంతోష్, గౌతమ్, అభిషేక్, రాకేశ్, సాయి తేజ, ధర్మేంద్ర, తులసి, గని, సతీష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.









