
ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా JSP ALL నియోజకవర్గం TEAM తలపెట్టిన గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా ఈరోజు “ప్రకృతి పరిరక్షణ దినం” సందర్భంగా గొప్ప పర్యావరణవేత్త శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారి స్పూర్తితో జగ్గయ్యపేట నియోజకవర్గంలో నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రేపటి తరం యువత, నేటి తరం యువతతో కలిసి కొన్ని మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా అధ్యక్షుల వారి పుట్టిన రోజులోపు నియోజకవర్గ వ్యాప్తముగా కొన్ని వందల మొక్కలు నాటటానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈరోజు “ప్రకృతి పరిరక్షణ దినం” సందర్భంగా రేపటి భవిష్యత్ అయినటువంటి చిన్న పిల్లలు సైతం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకి వచ్చి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టటం, ఆయన అడుగుజాడల్లో నడవటం శుభపరిణామం అని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో మొక్కలు నాటి అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవలసినదిగా కోరుచున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, ఆసిఫ్, తరుణ్, చరణ్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.








