
రైతులకు పంట నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తుఫాను బాధిత రైతులకు ఎకరానికి 35 వేల రూపాయల పంట నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలి. అలాగే తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయుటకు అనుమతి కోసం వెళ్ళిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా జనసైనికులు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిరసన చేస్తున్న జనసైనికులను కూడా అరెస్ట్ చేసి పోలీసులు ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్ కి తరలించారు. మైలేరి మల్లయ్య మాట్లాడుతూ రైతుల కోసం చేస్తున్న దీక్షను ప్రభుత్వం ఒత్తిడి వల్ల పోలీసులతో దీక్ష చేయకుండా ఆపడం సిగ్గుచేటు అని దీక్షను అయితే ఆపగలిగారు. కానీ రైతులకు నష్ట పరిహారం ఇప్పించే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని రైతుల కష్టాలను విస్మరించే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అన్నారు. ప్రభుత్వ కేవలం రైతు బాంధవ ప్రభుత్వం అని చెప్పుకోవడమే కానీ రైతు పక్షాన ఏ మాత్రం నిలువలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జమాల్ బాష, కో,టి, నరేంద్ర, ఆంజనేయులు వెంకటసుబ్బయ్య, రామచంద్రుడు, ఆచారి, సుబ్బయ్య, రాజారామ్, లోకేష్, రాజశేఖర్, సలీమ్, శుభాష్, వంశీ పాల్గొన్నారు.








