
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు, మరియు ధర్మవరంలో టిడిపి మహిళలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








