
ధర్మ పరిరక్షణ దీక్ష లో చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు
జనసేన పార్టీ మరియు బీజేపీ ఆదేశాల మేరకు దేవత మూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు, జనసేన పార్టీ PAC సభ్యులు DR.పసుపులేటి హరిప్రసాద్ గారు, కృష్ణయ్య గారు, చిన్న రాయల్ గారు, ఆనంద్ గారు, జ్ఞాన గారు మరియు లోకేష్ గారు దీక్ష చేపట్టారు. భారతదేశ సంస్కృతిపై కానీ, సాంప్రదాయాల పైన గాని దాడులు జరిగితే సహిస్తూ ఊరుకోం, హిందూమతంపై కానీ, మహ్మదీయ మతం పై కాని మరియు క్రిస్టియన్ మతం పై కానీ ఎవరు దాడులు చేసినా ఉపేక్షిస్తే చూస్తూ ఊరుకోమని అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న వారిపై విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జనసేన పార్టీకి భారతదేశం లోని అన్ని మతాలు అన్ని కులాలు సమానం అని అందరి సాంప్రదాయాలని గౌరవిస్తాం అని తెలియజేయడానికి గర్వపడుతున్నాం అని తెలియచేసారు. కంచన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమని పిఠాపురంలో జరిగిన దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దహణం , అంతర్వేదిలో జరిగిన లక్ష్మీ నరసింహస్వామి రథం దహణం చూస్తుంటే కొన్ని దృష్టశక్తులు కావాలనే హిందువుల మనోభావాల దెబ్బతినేలా, విద్వేషాలు రెచ్చ కొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సర్వమతాలను గౌరవిస్తారని, సంప్రదాయ, ఆచారాలకు విలువ ఇస్తారని వారు తెలిపారు.








