
చిన్నచిన్న సమస్య లను సకాలంలో పరిష్కరించ లేరా…? : జనసేన నాయకులు యుగంధర్ పొన్నాల
నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం గ్రామ పంచాయతీకి చెందిన పద్మ అనే మహిళకు గత సంవత్సరం జులై 2019 నుండి 2020 వ సంవత్సరం ఆగష్టు వరకు పెన్షన్ ఇచ్చారు. ఆ తరువాత పెన్షన్ ఆపేసారు. సంబధిత అధికారిని అడిగితే సరిగా స్పందన రాలేదు. ఈ విషయమై నియోజకవర్గ ఇంచార్జి Dr యుగంధర్ పొన్నాల గారు మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఇదివరలో దీనికి సంబంధించిన విజ్ఞప్తి చేయడం జరిగింది. మరలా రెండవ సారి కలిసి వెంటనే పరిష్కరించాలని కోరారు. రెండు రోజుల్లో ఈ సమస్యని పరిష్కరించక పోతే ఇక్కడే నిరాహార దీక్ష జనసేన చేయవలసి వస్తుందని, డానికి కూడా స్పందన రాకపోతే కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలను కూడా సకాలంలో పరిష్కరించకపోతే, ఇక పెద్ద పెద్ద సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు అని తెలిపారు. జనసేన ఎప్పుడూ చిన్న సమస్య, పెద్ద సమస్య అని చూడదు, సమస్య ఏదైనా సరే ప్రజాపక్షం నింపబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సురేష్ నాయుడు, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, కార్యనిర్వాహక కారదర్శి దేవ, కార్యదర్శి హేమాద్రి, సమన్వయ కర్త రాఘవ కలిశారు.








