
అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, దుస్తులు పంపిణీ, ఆర్థిక సహాయం చేసిన జనసైనికులు
మాడుగుల నియోజకవర్గం, కోటపాడు మండలం, గొల్లలపాలెం గ్రామంలో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకలు జరిపిన జనసైనికులు. ఈ సందర్భంగా గోల్డ్ గోవింద, బొట్ట పాలవెల్లి, కె మోహన్ కృష్ణ, వరహాలు రాజు, యస్ నాగరాజు, యమ్ పి రాజు, జి వి మూర్తి కలిసి అనాధలకు రెండేసి జతల బట్టలు, ₹3000 రూపాయల నగదు అందించారు. జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సహాయం ఉన్న చోట ఆదుకోవడానికి జనసైనికులు ముందుంటారని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో మా గ్రామంలో మా శక్తి మేరకు జనసేవ కార్యక్రమాలను చేశామని అన్నారు.








