ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భీమ్లా నాయక్ చిత్రం విడుదల వేడుకలు : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

    ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో కలిసి ఆత్మకూరు పార్టీ కార్యాలయం నుండి సినిమా హాలు వరకు తీన్మార్, బాణాసంచాలు మరియు జై జనసేన అనే నినాదాలతో ఊరేగింపుగా వెళ్లి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి యువశక్తి ఒక్క జనసేన పార్టీకె సొంతమని జన సైనికులు లేకపోతే జనసేన పార్టీ లేదని కొనియాడుతూ ఈ సందర్భంగా వారికి ఆత్మకూరు జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

See also  భక్తుల మనోభావాలను కించపరిచేలా చేయద్దు ~ జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి