
కదిరి నియోజకవర్గంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసిన ఇంచార్జ్ భైరవ ప్రసాద్
కదిరి నియోజకవర్గంలోని కదిరి మండలం పట్నం గ్రామపంచాయతీ జనసేన పార్టీ కమిటీని నియోజకవర్గ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ సమక్షంలో కదిరి పార్టీ కార్యాలయం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షునిగా రమణప్ప కార్యదర్శులుగా లక్ష్మీపతి, చంద్రశేఖర్ సభ్యులుగా శంకర్, భార్గవ ,ధనుంజయ, మారుతి ,చంద్రకాంత్, అనిల్ కుమార్ ,భార్గవ ,గణేష్ లను ఎంపిక చేశారు. మిగతా కమిటీని పూర్తిస్థాయిలో తొందరలోనే ఎంపిక చేస్తామని వారు తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీని పట్నం గ్రామంలో బలోపేతం చేసి పట్నం పంచాయతీలో జనసేన జెండాను ఎగుర వేస్తాము అని తెలియజేశారు. భైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 600 ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్నం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.








