జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బార అదిప్పకు రూ. 50 వేల ఆర్థిక సహాయం

జనసేన పార్టీ

         శింగనమల ( జనస్వరం ) : జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి జనసైనికునికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్  పేర్కొన్నారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బార్ అదెప్ప ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. దీంతో జనసేన నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్షతగాత్రునికి ఆర్థిక సహాయం ప్రకటించారు. సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో అనంతపురము జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ క్రియాశీలక కార్యకర్త బార అదిప్ప గారికి 50,000/- వేల చెక్ అందజేశారు. ప్రతి జనసేన కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది టి.సి.వరుణ్ పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇంచార్జ్  సాకే పవన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, చొప్ప చంద్ర,  జయమ్మ, అవుకు విజయకుమార్, పురుషోత్తం రెడ్డి, ముప్పూరి కృష్ణ, కృష్ణమూర్తి, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్, నార్పల మండల కన్వీనర్ రామకృష్ణ, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్  ఎర్రిస్వామి మరియు నాయకులు లోకేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల గూర్చి కార్యకర్తలతో సమావేశం