క్యాన్సర్ బాధిత యువకుడికి అండ, రూ.26500 ఆర్థిక సహాయం చేసిన అవనిగడ్డ జనసైనికులు

క్యాన్సర్ బాధిత యువకుడికి అండ, రూ.26500 ఆర్థిక సహాయం చేసిన అవనిగడ్డ జనసైనికులు

          నాగాయలంకలో కాన్సర్ బాధిత యువకుడు శీలి మధు(నిరుపేద దళిత రిక్షా కార్మికుడు) చంటి కుమారుడు ఆరోగ్యం కుదుట పడటం కోసం జనసేన యువ హృదయాలను కదిలించాయి. కష్టాలు చూడగానే మేం ముందుంటాం అంటూ నడుం బిగించిన పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు తక్షణమే స్పందించి తెల్లవారేటప్పటికి తాము రూ.26,500 సమీకరించారు. ఈ మొత్తాన్ని బాధితుడు తండ్రి చంటికి ఇచ్చారు. సేవకు మార్గం చూపిన మీరు ఉండాల్సిందే అని గ్రామ ప్రజలు కొనియాడారు.. ప్రముఖ న్యాయవాది జనసేన మాస్టర్ ట్రైనర్ రాయపూడి వేణుగోపాల్, సింహాద్రి కృష్ణప్రసాద్ చేతులమీదుగా ఆ కుటుంబానికి అందచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్, బొడ్డు విజయ్, బండ్రెడ్డి. మల్లిఖార్జున్, చిరుగోపి, అంకాల రావు, తోటశ్రీను, పాపారావు, మత్తి.సుబ్రమణ్యం, అభిమానులు పాల్గొని రమేష్, చంటి గార్లకు అందచెయ్యడం జరిగింది.

See also  రోడ్లు బాగుచేయించండి సారూ... - జనసేనపార్టీ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేత