ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి, పరామర్శించిన జనసేన వీర మహిళ రమ్యజ్యోతి పిళ్ళా

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి, పరామర్శించిన జనసేన వీర మహిళ రమ్యజ్యోతి పిళ్ళా

                 పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నివసించే ప్రభుత్వ ఉఫాద్యాయుడిపై దాడి జరగడం దారుణం అని జనసేన వీర మహిళ రమ్యజ్యోతి పిళ్ళా  గారు అన్నారు. ఆమె మాట్లాడుతూ దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. నిందితులు ఎలాంటి వారైనా సరే కఠినంగా శిక్షించి బాధితులకు తగిన న్యాయం చేకూరాలని కోరారు.  లేకుంటే వారి పక్షాన బలంగా పోరాడటానికి సిద్ధమని, బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి తగిన సహయం అందించారు.  అన్యాయంపై రాజీలేని పోరాటం చేయడం జనసేన సిద్ధాంతం అని భరోసాను అందించారు. ఈ కార్యక్రమంలో  జనసేన వీరమహిళ రమ్యజ్యోతి పిళ్ళా, జనసైనికులు చేదులూరి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

See also  పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల‌కు ఉచిత బ్రేక్‌ఫాస్ట్