అరెస్ట్ చేయడం దారుణం : జనసేన నాయకులు కొండేపూడి శంకర్రావు

అరెస్ట్ చేయడం దారుణం : జనసేన నాయకులు కొండేపూడి శంకర్రావు

                 అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ హిందూ ధార్మిక సంఘాలు నాయకులను ఉదయం 5 గంటల సమయంలో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండేపూడి శంకర్రావు గారు మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా దారుణం అని అన్నారు. జనసేన వీర మహిళ పిల్లా రమ్యజ్యోతి మాట్లాడుతూ మాకు మా పార్టీ నుండి పిలుపు రాలేదని ఎంత మొత్తుకున్నా స్టేషన్ వచ్చి సంతకం పెట్టి వెళ్లాలని దాంతోపాటు పెళ్లి కాని మహిళలలు, పిల్లల తల్లులు ఉన్నారని , త్వరగా ఇంటికి పంపించమని ఎంత మొత్తుకున్నా సరే సుమారు 10 గంటల వరకు మా అందరినీ స్టేషన్లో  బంధించి ఉంచారు.  తప్పులు చేసిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయలి కాని,  న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం ఆవేదన వ్యక్తం చేశారు.

See also  వైసీపీ అక్రమాలపై నినదించేందుకు ఛలో బొబ్బిలి