సొంత నిధులతో రోడ్లు వేసుకున్న అరవపాలెం గ్రామ జనసైనికులు

   రాజోలు, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం అరవపాలెం గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రభుత్వంపై మండిపడ్డ గ్రామస్తులు మరియు జనసైనికులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో స్వయంగా రంగంలోకి దిగిన జనసైనికులు. అరవ పాలెం నుండి చింతలపల్లి రోడ్డు అధ్వానంగా మారడంతో సొంత ఖర్చులతో చందాలు వేసుకుని రోడ్లు చదును చెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు, రైతులు పాల్గొనడం జరిగింది.

See also  అమరుడైన జనసైనికుడి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు వాసగిరి మణికంఠ