ఏపీ మంత్రులకు తిట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదు ! జనసేన నాయకులు బొమ్మన పురుషోత్తమ రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర మంత్రి అయినా రోజా మీరు మాట్లాడేది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, పవన్ కళ్యాణ్ ఏ రోజు వచ్చిన ఎప్పుడు వచ్చినా ఆయన ప్రజా సమస్యల మీద మాత్రమే మాట్లాడతారని,  ప్రజల సమస్యల పైన మాత్రమే పోరాడతారని తెలిపారు. మరి మీరు మంత్రిగా ఉండి పర్యాటకంగా రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో నిత్యం ప్రజా సమస్యల పైన పోరాడే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  మాత్రమే అని పేర్కొన్నారు. అలాగే రాంబో రాంబాబు అధికారంలో ఉన్నది మీరే కదా ప్యాకేజీ ప్యాకేజీ అని మాట్లాడే బదులు మరి మీరు నిరూపించవచ్చు కదాని తెలిపారు. మీది తెలుగుదేశం పార్టీది 60:40 బంధం కదా అందుకే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబుపై అవినీతిపైన పుస్తకాలు విడుదల చేసి నేటికీ వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మీద పెట్టిన శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు మీద అలాగే ప్రాజెక్టుల భద్రత మీద పెడితే బాగుంటుందని హితవుపలికారు.

See also  చిన్న కల్వర్టును పూర్తి చేయలేని, జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కడతాడా ?