అనంతపురం – మడకశిర మండలంలో జనసేన పార్టీలోకి చేరికలు

మడకశిర

      అనంతపురం ( జనస్వరం ) : మడకశిర పట్టణంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన చందకచర్ల గ్రామ యువకులను మండల అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. శివాజీ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితర జనసైనికులు పాల్గొనడం.  జరిగింది. 

See also  ఒక మెతుకు ఎవరికీ పెట్టని జబర్దస్త్ రోజా డౌన్ డౌన్ : గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నిరసన....