జనసైనికుని వినూత్న ప్రయత్నం – జనసేనాని అభినందన

జనసేనాని

         న్యూస్ ( జనస్వరం ) : ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి చెంతకు తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టిన జన సైనికుడు  బాలాజీని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. పల్నాడు ప్రాంతంలో పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి వాటిని పవన్ కళ్యాణ్ గారికి అందజేసేందుకు ‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరిట కార్యక్రమం చేపట్టనున్నారు. సొంత వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. జన సైనికుడు బాలాజీ ఆలోచన మెచ్చిన  పవన్ కళ్యాణ్ గారు అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్ ఫోన్ బహుకరించారు..

See also  సినీ నటుల అభిమానుల్లో రాజకీయ చైతన్యం పెరగాలి