విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ అంతరాయంపై ధర్నా చేసిన ఆముదాలవలస జనసైనికులు

విద్యుత్

      ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం కొల్లివలస జంక్షన్ లో శ్రీ కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు మరియు ఎంపీటీసి అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు మరయూ విద్యుత్ అంతరాయం పై ధర్నా చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, వ్యాపారస్తులు మరియు మద్య తరగతి కుటుంబాలు విద్యుత్ అంతరాయంపై చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. గన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచి పేదవాళ్లపై పెనుబారం మోపుతుందని, ఇప్పటికే కరోనా విపత్తువలన అన్ని వర్గాల ప్రజల ఆదాయాలపై పెనుబారం పడిందన్నారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశానికి అంటాయని, ఇప్పుడు మరలా విద్యుత్ చార్జీలు పెంచితే పేదవారు జీవించేది ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జైరాం, సంగం నాయుడు, సంతోష్ జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

See also  పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు