
మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, వీరవిల్లి అగ్రహారం గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన వీరవిల్లీ అగ్రహారం గ్రామ యువకులు మొగ్గా శ్రీనివాస్, మొగ్గా దివాకర్ లను మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ గారి చేతుల మీదుగా జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా వారికి పార్టీ యొక్క సిద్ధాంతాలను, ఆశయాలును గురించి వివరించారు. అలాగే క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, అధికార పార్టీ వైఫల్యాలను, పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఐతే జరగబోయే పరిపాలన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు వివరించి పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేయాలని చెప్పి వారినీ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ వీర మహిళ గుమ్మడి రేవతి, మాడుగుల మండల పరిధిలోని గల జనసైనికులు, వీరవిల్లి అగ్రహారం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.









