గుడివాడ నియోజకవర్గములో తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

తెలుగుదేశం పార్టీ

   కృష్ణా, (జనస్వరం) :  కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం  తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ఇమాం షరీఫ్ గారు మరియు వారి అనుచరులు  జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ గారు కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్  గారు మాట్లాడుతూ షరీఫ్  గారు ఎంతో కాలంగా గుడివాడలో మంచి సేవా దృక్పదంతో పరంగా అయితే ఏమి ఊరు అభివృధి చెందాలి అనే మంచి దృడ సంకల్పంతో ఉన్న వ్యక్తి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతలు, ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలోకి రావడము ఎంతో ఆహ్వానించ దగ్గ విషయం అని అన్నారు. ఇంకా ఎంతో మంది వివిధ పార్టీల నుండి త్వరలో జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. కృష్ణా జిల్లాలో  పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి తను కృషి చేస్తానని, జనసేన పార్టీలో గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్  గారి ఆధ్వర్యంలో పార్టీ లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని షరీఫ్ అన్నారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.

See also  జనసేన నాయకులపై బెదరింపులను నిరసిస్తూ...విడవలూరు పోలీసులకు ఫిర్యాదు